దేశంలోని సెల్ వినియోగదారులకు శుభవార్త!
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్ పీ)సేవలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. గురువారం హర్యానాలో తొలిసారిగా ఈ సేవలను కేంద్ర టెలికం శాఖ మంత్రి కపిల్ సిబాల్ ప్రారంభించారు.
మొబైల్ నంబర్ మార్చకుండానే వినియోగదారులు, తమ ఆపరేటర్లను మార్చుకునే సౌలభ్యాన్ని ఈ సేవలు ఉపకరిస్తాయి. ఎంఎన్పీ సర్వీసులను అందుబాటులో కి తెచ్చేందుకు రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చాయి.
ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది జనవరి 20 నాటికి దేశవ్యాప్తంగా ఎంఎన్పీ సేవలను అందించనున్నట్టు డాట్ తెలిపింది.

Post a Comment