Home » » ‘పవర్‌’ పీఆర్పీ కోసమేనా ?

‘పవర్‌’ పీఆర్పీ కోసమేనా ?

Written By Mr.D.S on Thursday, December 2, 2010 | 8:34 PM


prpరెండు కీలక శాఖలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తన వద్దే అట్టి పెట్టుకోవడం వెనుక మర్మం ఏమిటో క్రమంగా వెలుగు చూస్తోంది. పరిసి ్థతులు అనుకూలిస్తే ఏ క్షణంలోనైనా ప్రభుత్వం లో చేరడానికి సిద్ధంగా ఉన్న ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి తీసుకుని ప్రస్తుతం తన వద్ద విద్యుత్‌, వాణిజ్య పన్నుల శాఖలను వారికి కేటాయించవచ్చని తెలుస్తోం ది. వాటితో పాటు మరో రెండు శాఖలను పి ఆర్పీకి ఇవ్వవచ్చని సమాచారం.

ప్రభుత్వంలో చేరితే..పిఆర్పీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు (అనకాపల్లి), కాటసాని రామిరెడ్డి (బనగానపల్లి)లకు విద్యుత్‌, వాణిజ్య పన్నులను కేటాయించవచ్చు. వారిద్దరితో పాటు సి రామచంద్రయ్యతో పాటు మరొకరికి పదవీయోగం దక్కవచ్చని తెలుస్తోంది. సి రామచంద్రయ్య ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయనను శాసనమండలికి పంపించి, మరీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లే పోలేదు. కర్నూలుజిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసు కోవాలనే ఉద్దేశంతోనే అదే జిల్లా పాణ్యం శాస నసభ్యుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి మొండిచెయ్యి చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్‌ కేం ద్రాలు విచ్చలవిడిగా ఏర్పాటు అవుతున్న ప్రస్తుత తరుణంలో విద్యుత్‌శాఖ అత్యంత కీల కంగా మారింది. అయినప్పటికీ..14 నెలలు గా ఈ శాఖను ఎవరికీ కేటాయించలేదు.

2009 లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి, అనంతరం కె రోశయ్య లు కూడా విద్యుత్‌ శాఖను తమ వద్దే అట్టిపె ట్టుకున్నారు. అదే సంప్రదాయాన్ని తాజాగా సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా కొనసాగిస్తుం డటం అనూహ్య పరిణామం. ఇదిలావుండ గా..మంత్రివర్గంలో అంటూ చేరితే తమకు వి ద్యుత్‌, వాణిజ్య పన్నులు, ఆర్థికం, గనుల శాఖ లు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుందని పిఆర్పీ అధినేత చిరంజీవి బేరం పెట్టినట్లు తెలుస్తోంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger