జగన్కూ, అధిష్ఠానానికీ సయోధ్య కుదిరి స్తానని, సోనియా వద్దకు జగన్ను తీసుకు వెళ్ళి సాక్షి కథ నం, ఇతర పరిణామాలపై విచారం వ్యక్తం చేయిస్తానని ఢిల్లీలో వివేకా ప్రకటించి 24 గంటలు కాకుండానే కాంగ్రె స్ పార్టీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేసి, తన తల్లిగారైన పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మతో సైతం జగన్ రాజీ నామా చేయించి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ చిన్నాన్నను చేరదీయటం ద్వారా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని జగన్ ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
వ్యూహాత్మక భేటీలు...
తప్పు లేదని చెప్పుకునేందుకే...
ఒకవేళ జగన్నే ఢీకొనాల్సి వస్తే పులి వెందుల నియోజకవర్గంలో అత్యంత కీలకమైన, కాంగ్రెస్ పార్టీకి పూర్తి వోటు బ్యాంకు ఉన్న లింగాల, వేముల మండ లాల్లో జనాన్నంతటినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం వివేకా ఇప్పటినుంచే చేస్తున్నారు. ఈ రెండు మండలా ల్లోనూ వివేకా బంధువులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయాల్లో వేరు పడినంత మాత్రాన కుటుంబంలో కలతలు రేగే అవకాశం లేదని వివేకా పదే పదే చెప్పారు. మరోవైపు జగన్ సైతం చిన్నాన్నతో తనకు ఎలాంటి జగడం లేదని, ఆయన అంటే ఎప్పటికీ గౌరవమే అని ప్రకటించారు.
‘వ్యవసాయం’ లో సమస్యల సవాళ్ళు !
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ శాఖలు కేటాయించటంతో వారి వారి శాఖల బాధ్యతలు స్వీకర ణలో మంత్రులు ముహూర్తబలాలు వెతుక్కుంటున్నారు. అయితే వ్యవసాయ మంత్రిత్వ శాఖను చేపట్టిన వైఎస్ వివేకానంద రెడ్డి గురువారం క్యాబినెట్ సమావేశానికి మందే తనశాఖ కార్యక్రమాలపై ఆరాతీశారు. మంత్రి వివేకా మధ్యాహ్నం నేరుగా బషీర్బాగ్లోని రాష్ట్ర వ్యవ సాయశాఖ డైరక్టరేట్కు వెళ్ళారు. సుమారు గంటన్నరకు పైగా అక్కడే గడిపారు. వ్యవసాయరంగంలో నెలకొన్న సమస్యలను సవాలుగా స్వీకరించారు.
రైతుకు పంటలసాగుద్వారా ఆదాయాన్ని పెంచినప్పుడే వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతున్నారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలకు అధికారులు వారి వారి స్థాయిల్లో తక్షణం స్పందిచాలని హెచ్చరించారు. ఉదయం మంత్రి వివేకానందరెడ్డిని అభినందించేందుకు పుష్ప గుచ్చాలతో వెళ్ళిన కొద్దిమంది వ్యవసాయశాఖ సిబ్బందిని ఉద్దేశించి తనవద్దకు ఎవరూ రావద్దని సున్ని తంగా పేర్కొన్నారు. తాను వస్తున్నట్టు ముందుగా ఎవ రికీ చెప్పకుండా ఆకశ్మికంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ డైర క్టరేట్కు వెళ్ళారు. మంత్రి వచ్చిన సమాచారాన్ని గమ నించిన కమీషనర్ సునిల్ శర్మ మంత్రిని తన ఛాంబర్ లోకి ఆహ్వానించారు.
Post a Comment